Posted by admin on 2023-02-01 12:26:48 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 270
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోంది.
బడ్జెట్ లో తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపింది.
బయ్యారం ఉక్కు కర్మాగారానికి బడ్జెట్ లో నిధులేవి
సాగునీటి ప్రాజెక్టులకు నిధులు లేవు.
పేదల పట్ల ఈప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ, పట్టింపు లేదు.
ఏరకంగా చూసినా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను కాంగ్రెస్ ఖండిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అండగా నిలబడింది.
బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి బీజేపీ, బీఆరెస్ ఇద్దరు దోషులే.
మోదీ, కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు తెలంగాణకు అన్యాయం చేశారు.
ఇప్పటికైనా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి.
రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన నిధులను కేంద్రం కేటాయించాలి.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించాలి.
మోదీగారు మీరు గుజరాత్ కు సీఎం కాదు.. ఈ దేశానికి ప్రధాని.
నిధుల కేటాయింపులో గుజరాత్ కు కల్పించిన ప్రాధాన్యతను తెలంగాణకు కల్పించండి.
మోదీ అన్యాయం చేస్తుంటే.. నిలదీయాల్సిన బీఆరెస్.. సభలో నిస్సహాయంగా నిలబడింది.
అవినీతిని కప్పి పుచుకోవడానికే.. కేసీఆర్ కేంద్రంతో కాళ్లబేరానికి దిగాడు.
తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.
.